Saturday, May 18, 2024

అమెరికాలో సిక్కు గాయకుడి దారుణ హత్య

spot_img

అమెరికాలో మరో భారతీయుడు దారుణ హత్యకు గురయ్యాడు. సిక్కుమతానికి చెందిన రాజ్ సింగ్ అలియాస్ గోల్డీ అనే సింగర్ ను అలబామాలో దుండగులు కాల్చి చంపారు. అతని వయసు 29 ఏళ్లు. గురుద్వారా ఎదుట రాజ్ సింగ్ నిలబడి ఉండగా దుండగులు అతనిపై కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో రాజ్ సింగ్ అక్కడికక్కడే చనిపోయాడు. సిక్కుల కీర్తన బృందంలో సభ్యుడిగా అతను ఏడాదిన్నర కిందట అమెరికాకు వెళ్లాడు. అప్పటి నుంచీ అమెరికాలోనే ఉంటున్నాడు.

రాజ్ సింగ్ హత్య విషయం గురుద్వారా కమిటీ ద్వారా తమకు తెలిసిందని, హత్య జరిగి ఐదు రోజులైనా ఇంతవరకూ పోస్ట్ మార్టం జరగలేదని మృతుడి బావ గుర్ దీప్ సింగ్ చెప్పారు. రాజ్ సింగ్ స్వస్థలం ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ జిల్లా తండా సెహువాలా గ్రామం.

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో చిన్నారులకు స్కార్లెట్‌ జ్వరం..ఆసుపత్రులకు క్యూ

Latest News

More Articles