హైదరాబాద్: కూకట్పల్లిలో పోలీస్ స్టేషన్ పరిధిలో మాదాపూర్ ఎస్.ఓ.టి. పోలీస్ కానిస్టేబుళ్లపై గుర్తు తెలియని వ్యక్తి తల్వార్ తో దాడికి పాల్పడ్డారు.
ఓ కేసు దర్యాప్తు నిమిత్తం కానిస్టేబుల్స్ వినయ్, రాజులు సిక్కుల బస్తీకి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నది.
రాజు అనే కానిస్టేబుల్ ఛాతీలో తల్వార్ తో పొడిచిన దుండగుడు… మరో కానిస్టేబుల్ వినయ్ తలపై దాడి చేశాడు. .. గాయాలైన రాజు, వినయ్ లను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.