హర్యానా భివానీలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సెర్లా శివారులో జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు యువకులు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యువకులు ఓబ్రా నుంచి బహల్ వైపు వెళ్తున్న సమయంలో వారు ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జ అయ్యింది.
Also Read.. 10 అర్హతతో ఐబీలో 677 ఉద్యోగాలు
మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో లారీ వెనుక తాడును సరి చేస్తున్న క్లీనర్ సైతం మృతి చెందాడు. లారీ క్లీనర్ను యూపీకి చెందినవాడు కాగా.. మృతులను బుధేరాకు చెందిన వారిగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.