Sunday, May 19, 2024

జయప్రద పరారీలో ఉన్నారు: స్పెషల్ కోర్టు

spot_img

సినీ నటి, రాజకీయ నాయకురాలు జయప్రద ‘పరారీ’లో ఉన్నారని ఉత్తరప్రదేశ్ లోని ప్రజాప్రతినిధుల కోర్టు ప్రకటించింది. 2019లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టు జయప్రదపై రెండు కేసులు కోర్టు విచారణకు వచ్చాయి. ఈ విచారణలకు సంబంధించి జయప్రదపై ఏడుసార్లు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. అయినప్పటికీ ఆమె కోర్టుకు హాజరుకాలేదు.

దీంతో ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి శోభిత్ బన్సాల్ జిల్లా ఎస్పీకి ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. పరారీలో ఉన్న జయప్రదను కోర్టులో హాజరుపరిచేందుకు ఓ స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేయాలని  తెలిపారు. మార్చి 6 లోపు ఆమెను కోర్టులో ప్రవేశపెట్టాలని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి:హామీల అమలుపై మాట మార్చడం కాంగ్రెస్ కు అలవాటైంది

Latest News

More Articles