Sunday, May 19, 2024

అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ట…భద్రాద్రి ఆలయంలో ప్రత్యేక పూజలు

spot_img

అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ట వేడుకలకు దేశం మొత్తం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ(సోమవారం) జరగబోయే శ్రీరాముని ప్రాణప్రతిష్టకు భద్రాద్రి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ఆలయాధికారులు.

మామిడి తోరణాలు, వివిధ రకాల పూలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజలు, శోభాయాత్రతో పాటు పలు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే మేళతాళాలు, వేద మంత్రాల నడుమ శ్రీరామరథం వేదికగా శోభాయాత్ర ప్రారంభమైంది.

అయోధ్య రాముడి ప్రతిష్ట సందర్భంగా భద్రాద్రిలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ ఈఓ రమాదేవి తెలిపారు. రామయ్య ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకుని ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలిరానుండటంతో అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

ఇది కూాడా చదవండి: ఈ నెల 24 నుంచి జేఈఈ మెయిన్‌..!!

Latest News

More Articles