రామమందిర్ దర్శనానికి వెళ్లాలనుకునే వారికి హైదరాబాద్ రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. అయోధ్యకు హైదరాబాద్ నుంచి ప్రతి శుక్రవారం ప్రత్యేక రైలు నడుపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈనెల 22న అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవం జరుగనున్న నేపథ్యంలో యశ్వంత్పూర్-గోరఖ్పూర్ (నెంబర్ 15024) ఎక్స్ప్రెస్ రైలు ప్రతి గురువారం రాత్రి 11.40 గంటలకు యశ్వంత్ పూర్లో బయలుదేరి శుక్రవారం ఉదయం 10.40 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్ చేరుతుంది. 10.50 గంటలకు కాచిగూడలో బయలుదేరి కాజీపేట, బలార్షా, నాగాపూర్, ఇటార్సీ, భోపాల్, ఝాన్సీ, కాన్పూర్, లక్నో మీదుగా శనివారం సాయంత్రం 4.25 గంటలకు అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ చేరు కుంటుంది. అక్కడి నుంచి గోరఖ్పూర్ వెళుతుందని రైల్వే అధికారులు తెలిపారు.
Read Also: అయోధ్యలో రామమందిర ప్రారంభం.. రూ. లక్షకి చేరిన హోటల్ రెంట్