Friday, May 3, 2024

అప్పుడే కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమైంది.. పొన్నాల ఇంట్రెస్టింగ్ కామెంట్స్

spot_img

జనగామ జిల్లా : కాంగ్రెస్ పార్టీకి విచక్షణ లేదు, అవగాహన లేదు, ఆలోచన లేదు, అనుభవం లేదు.. అహంకారంతో చేసే పనితోటి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. జనగామలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ 24 గంటల కరెంటు ఇస్తుంటే, రేవంత్ రెడ్డి 3 గంటల కరెంటు చాలు అన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమయ్యిందని చెప్పారు.

Also Read.. కొచ్చిలో నేవీ హెలీకాప్టర్‌ కూలి ఓ అధికారి మృతి

ఈ రాష్ట్రంలో మరోసారి కేసీఆర్ సర్కార్ కు ప్రజలు అవకాశం ఇవ్వాల్సిన అవసరం, ఆవశ్యకత ఉన్నది. మరెన్నడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తదని ఆలోచన లేదు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీలకు, బీసీలకు, మైనార్టీలకు దూరమైంది. మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ అవడం తథ్యం. ప్రజల చెంతకు పాలన, ప్రజల చెంతకు సంక్షేమ పథకాలు చేరేలా కేసీఆర్ పరిపాలన ఉంది. కేసీఆర్ ని మూడవసారి ముఖ్యమంత్రిగా చేయాలనే లక్ష్యంతో పనిచేస్తా. ఓట్ల కోసం కాదు, రాజకీయాల కోసం కాదు, ప్రలోభాల కోసం కాదు ఇది చారిత్రక అవసరం అని పొన్నాల అన్నారు.

Latest News

More Articles