Saturday, May 18, 2024

చంద్రబాబుకు త్రుటిలో తప్పిన ప్రమాదం!

spot_img

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్టేజిపై నుంచి కిందపడబోయారు.  రాజమండ్రి నియోజకవర్గ పరిధిలోని కాతేరులో నిర్వహించిన సభలో పాల్గొన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సభ ముగిసిన అనంతరం కార్యకర్తలు ఒక్కసారిగా స్టేజిపైకి రావడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో చంద్రబాబు తూలి పడబోయారు. సెక్యూరిటీ  సిబ్బంది వెంటనే అప్రమత్తమైన ఆయన్ను పట్టుకున్నారు. అనంతరం చంద్రబాబును రక్షణ సిబ్బంది సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు.

 

Latest News

More Articles