Tuesday, May 14, 2024

ఉప్ప‌ల్‌ స్టేడియంలో టీమిండియా నెట్స్ ప్రాక్టీస్

spot_img

కొత్త ఏడాదిని విజ‌యంతో ఆరంభించిన‌ భార‌త జ‌ట్టు సొంత‌గ‌డ్డ‌పై ఇంగ్లండ్‌ను ఢీ కొట్టేందుకు సిద్ధ‌మైంది. ఐదు టెస్టుల సిరీస్‌లో బెన్ స్టోక్స్ సేనను చిత్తుగా ఓడించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది. జ‌వ‌వ‌రి 25 గురువారం జ‌రుగ‌నున్న‌ తొలి టెస్టు కోసం భార‌త జ‌ట్టు హైద‌రాబాద్ చేరుకుంది.

ఇది కూడా చదవండి: తప్పుల తడకగా నూతన ఓటర్ లిస్టులు!

టీమ్ హోట‌ల్ నుంచి ఇవాళ(మంగ‌ళ‌వారం) రోహిత్ సేన ఉప్ప‌ల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియానికి వెళ్లింది. అక్క‌డ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, కేఎల్ రాహుల్ నెట్స్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. హైద‌రాబాదీ పేస‌ర్ సిరాజ్, ఆఫ్ స్పిన్నర్ అక్ష‌ర్ ప‌టేల్, కుల్దీప్ యాద‌వ్ బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. తర్వాత  ఆట‌గాళ్లంతా మైదానంలోనే కాసేపు రిలాక్స్ అయ్యారు. టీమిండియా ప్రాక్టీస్ సెష‌న్‌ వీడియోను బీసీసీఐ ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.

 

 

 

Latest News

More Articles