Monday, May 20, 2024

కాంగ్రెస్ లో రెజ్లింగ్ షురూ.. కొత్తగూడెం సీటుపై కొట్లాట

spot_img

టికెట్లు రాకుంటే గాంధీ భవన్ ని కాల్చిపడేసిన చరిత్ర కాంగ్రెస్ నాయకులది. ప్రజాస్వామ్యం పేరుతో రెజ్లింగ్ ఆడటం వారికి చాలా కామన్. ఇప్పటివరకు నివురుగప్పిన నీరులా ఉన్న కాంగ్రెస్ టికెట్ల పంచాయితీ ప్రస్తుతం తారాస్థాయికి చేరింది. అందరు అనుకుంటున్నట్టుగానే నిరసనలు భారీగా అవుతున్నాయి. ముఖ్యంగా టికెట్లు అమ్ముకున్న రేవంత్ రెడ్డి తీరుపైనే కాంగ్రెస్ నేతల ఆగ్రహాలు కట్టలు తెంచుకుంటున్నాయి. తాజాగా కొత్తగూడెం సీటు సీపీఐకి ఇవ్వొద్దంటూ కాంగ్రెస్ నేతల డిమాండ్ చేస్తున్నారు.

పొత్తులో భాగంగా టికెట్ సీపీఐకి ఇవ్వడాన్ని నిరసిస్తూ కొత్తగూడెంలో జిల్లా కాంగ్రెస్ A బ్లాక్ అధ్యక్షులు వీరయ్య చౌదరి, B బ్లాక్ అధ్యక్షులు రాయల శాంతయ్య విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగూడెం నియోజకవర్గం అసంబ్లీ స్థానాన్ని పొత్తుల్లో భాగంగా సీపీఐ పార్టీకి కేటాయించినట్లు వస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నామని అన్నారు. కొత్తగూడెం అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీకే కేటాయించాలని లేదంటే మా తడాకా చూపిస్తామని అధిష్టానానికి నేతల డిమాండ్ చేశారు.

Latest News

More Articles