Monday, May 13, 2024

పొంగులేటికి భారీ షాక్.. ఔకాత్ కి మించి ఎగిరితే గింతే

spot_img

తన ఔకాత్ కి మించి ఇజ్జత్ ఇచ్చిన బీఆర్ఎస్ ని మోసం చేసి వెళ్లిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తగిన శాస్తి జరుగుతుంది. కాంగ్రెస్‌ హైకమాండ్ శ్రీనివాస్ రెడ్డికి షాక్ ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఖమ్మం తన జాగిరన్నట్టు ఏతులు కొడుతూ.. 15 సీట్లను గెలిపిస్తానని ప్రగల్బాలు పలికిన పొంగులేటి కనీసం ఇప్పుడు టికెట్లు దొరకని పరిస్థితి. తాను ప్రతిపాదించిన వారికి టికెట్స్ ఇవ్వాలని ఆయన ప్రయత్నాలు చేస్తుంటే.. ఏకంగా ఆయన సీటుకే ఎసరు పెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. పొంగులేటి పోటీకి సిద్ధం అవుతున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం అసెంబ్లీ స్థానాన్ని పొత్తుల్లో భాగంగా సీపీఐకి ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి పొంగులేటిని పోటీ చేయించాలన్నది కాంగ్రెస్ హైకమండ్ ఆలోచనగా తెలుస్తోంది. కాంగ్రెస్ తో సీపీఐ, సీపీఎం పొత్తు దాదాపుగా కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రెండు పార్టీలకు చెరో రెండు సీట్లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

సీపీఐకి కొత్తగూడెం, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మునుగోడు అసెంబ్లీ స్థానాలను కేటాయించే ఛాన్స్‌ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సీపీఎంకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, ఉమ్మడి నల్లగొండలోని మిర్యాలగూడ అసెంబ్లీ స్థానాలు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే.. భద్రాచలం కాంగ్రెస్ సిట్టింగ్‌ ఎమ్మెల్యే పొదెం వీరయ్య పరిస్థితి ఏంటన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. భద్రాచలం సీటు సీపీఎంకు కేటాయిస్తే పోదెం వీరయ్యను పినపాకకు పంపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇలా జరిగితే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మరో షాక్ తగిలే అవకాశం ఉంది. పినపాక సీటును పోదెం వీరయ్యకు ఇస్తే పొంగులేటి ప్రధాన అనుచరుడైన మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కూడా పోటీకి దూరంగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది.

Latest News

More Articles