Monday, May 20, 2024

రైతుబంధు సంపూర్ణం.. స్వంతంత్ర భారత చరిత్రలో సరికొత్త రికార్డు

spot_img

11వ విడతలో రూ.7624.74 కోట్లు రైతుల ఖాతాల్లోకి వేసింది తెలంగాణ ప్రభుత్వం. 68.99 లక్షల మంది రైతులకు చెందిన 1.52 కోట్ల ఎకరాలకు పంపిణీ చేసింది. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 5 లక్షల 8756 మంది రైతులకు రూ.609.67 కోట్లు పంపిణి చేశారు. అత్యల్పంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 35,879 మంది రైతులకు రూ.33.60 కోట్లు ఇచ్చారు. తెలంగాణలో రైతును రాజును చేయాలన్న సంకల్పంతో కేసీఆర్ ముందుకు సాగుతున్నారని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.

‘ఎన్ని ఇబ్బందులున్న ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ పూర్తిచేస్తున్నాం. రైతుబంధు మొదలు పెట్టినప్పుడు ఎన్నికల కోసం అని విమర్శించారు. 11వ విడత రైతుబంధు విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. మొత్తం ఇప్పటి వరకు రూ.72,815.09 కోట్లు నేరుగా రైతుల ఖాతాలలోకి వేశామని.. స్వంతంత్ర భారత చరిత్రలో ఇది ఒక రికార్డు అని అన్నారు. అన్నదాతల గుండెల్లో కేసీఆర్ చిరస్థాయిగా నిలుస్తారు. అన్నం పెట్టే అన్నదాతకు ఆసరాగా నిలవాలన్నదే కేసీఆర్ గారి తపన. దేశంలో ఉచిత కరంటు, సాగునీళ్లు, రైతుబంధు, రైతుభీమా పథకాలతో పాటు వంద శాతం పంటలు కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. రాష్ట్ర రైతాంగం పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు’ అని అన్నారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

Latest News

More Articles