తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు ఎన్. ఉత్తమ్కుమార్, మహబూబ్నగర్ జిల్లాకు దామోదర్ రాజనర్సింహ, ఖమ్మం జిల్లాకు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రంగారెడ్డి జిల్లాకు దుద్దిళ్ల శ్రీదర్బాబును నియమించింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాకు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, హైదరాబాద్కు పొన్నం ప్రభాకర్, మెదక్ జిల్లాకు కొండ సురేఖ, ఆదిలాబాద్కు సీతక్క, నల్గొండకు తుమ్మల నాగేశ్వరరావు, నిజామాబాద్ జిల్లాకు జూపల్లి కృష్ణారావును ఇన్చార్జి మంత్రులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్చార్జి మంత్రులు త్వరలో ప్రారంభం కానున్న ప్రజాపాలన అమలును సమీక్షిస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు.