Sunday, May 19, 2024

కేంద్రం నిర్లక్ష్యంతో తెలంగాణకు 9ఏండ్లుగా తీవ్ర నష్టం

spot_img

నల్గొండ జిల్లా: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతి సాధించడం ప్రభుత్వ చిత్త శుద్ధికి నిదర్శనమని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్గొండ లోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

పాలమూరు క్లియరెన్స్ తో డిండి ఎత్తిపోతల పథకానికి లైన్ క్లియర్ అయినట్లే. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు లోని మొత్తం రెండు టీఎంసీ ల్లో అర టీఎంసీ నీరు డిండి ఎత్తిపోతలకు తరలిస్తారు. డిండి ద్వారా నల్లగొండ జిల్లాలో 3.61లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. నార్లాపూర్ నుంచి ఎదుళ్ల… అక్కడి నుంచి డిండికి గ్రావిటీ ద్వారా నీరు తేవాలని తొలి ప్రతిపాదన ఉందన్నారు.

ఇటీవల వట్టెం నుంచి ఎత్తిపోతల ద్వారా తేవాలానే రెండో ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది. రెండింట్లో ఎదో ఒక ప్రతిపాదన ద్వారా డిండికి నీళ్లు రావడం ఖాయం. కల్వకుర్తి లిఫ్ట్ పథకం రీ జనరేటర్ వాటర్ ద్వారా గత మూడు నాలుగు ఏండ్లగా డిండి రిజర్వాయర్ కి వరద వచ్చి అలుగు పోస్తుంది.దీనితో డిండి కింద ఆయకట్టుకు సాగునీరు పుష్కలంగా అందుతుందని తెలిపారు.

ఈ అలుగు నీటితో నక్కలగండి నీ నింపొచ్చు. నక్కలగండి 98 శాతం పూర్తి అయింది. గేట్లు బిగిస్తే నీరు నిల్వ ఉండనుంది. SLBC  సొరంగమర్గం పూర్తికి టెక్నికల్ గా చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. ఆ లోపు నక్కలగండి కి డిండి రిజర్వాయర్ నుంచి నీటిని మల్లించవచ్చు. ఇక డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఇప్పటికే గొట్టిముక్కల 98 శాతం, కిష్టారాంపల్లి, చర్లగూడెం 70 శాతం పూర్తి అయ్యాయి. వీటిని కూడా సహజ వరద ద్వారా కొంత నీటిని నింపొచ్చన్నారు.

పర్యావరణ అనుమతుల నేపథ్యంలో ఈ పనులు కూడా మరింత వేగంగా పూర్తి కావచ్చు. ఇక కృష్ణా, గోదావరి నీటి వాటాలు తేల్చడంలో కేంద్రం నిర్లక్ష్యం చేస్తుంది. దీని వాళ్ల తెలంగాణ కు 9 ఏండ్లుగా తీవ్రంగా నష్టం జరుగుతుంది. నది జలాల పంపకం పూర్తి అయితే ఇంకా వేగంగా నీటిని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. శ్రీశైలంలో మరో వంద టీఎంసీ లు, సాగర్ లో మరో రెండు వందల టీఎంసీ ల నీరు వస్తే నిండనున్నాయని వివరించారు.

అధికారులు చెపుతున్న ప్రకారం మరో 20, 30 టీఎంసీ నీరు వస్తే సాగర్ మొదటి జోన్ వరకు సాగునీరు ఇవ్వవచ్చు. ఇప్పటికే 30 టీఎంసీ ల వరకు అందుబాటులో ఉన్నట్లు లెక్కలు వెల్లడిస్తున్నాయని తెలిపారు.ఇప్పటికే నార్లు పోసుకున్న రైతులు సాగునీరు అడుగుతున్నారు. సెప్టెంబర్ వరకు వరదలు వచ్చే ఛాన్స్ ఉంటది. సాగర్ కు వరద వచ్చే అవకాశం ఉన్నది. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడుకు నీటిని తీసుకునే హక్కు లేదు. కానీ కరెంట్ ఉత్పత్తి మాత్రం చేసే హక్కు తెలంగాణ కు ఉన్నదని ఆయన పేర్కొన్నారు.

Latest News

More Articles