తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి రాష్ట్రం మొత్తం రాజకీయంగా వేడెక్కింది. పార్టీలన్నీ తమతమ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అదేవిధంగా ఎన్నికల సంఘం కూడా తమ విధులను పకడ్బందీగా నిర్వర్తిస్తోంది. ఎక్కడకక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తోంది.
Read Also: ఇంట్లోకి చొరబడి ప్రభుత్వ ఉద్యోగిని దారుణ హత్య
కాగా.. హోం శాఖ మంత్రి మహమూద్ అలీ కాన్వాయ్ని పోలీసులు ఆదివారం తనిఖీ చేశారు. కామారెడ్డిలో జరుగుతున్న మైనార్టీ నాయకుల సమావేశానికి వెళ్తుండగా.. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కళ్లకల్ చెక్ పోస్ట్ వద్ద ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి పోలీసులకు మంత్రి మహమూద్ అలీ పూర్తిగా సహకరించారు. మంత్రి వాహనంతో పాటు ఆయన వెంట ఉన్న ఇతర వాహనాలను సైతం పోలీసులు చెక్ చేశారు. తనిఖీకి సహకరించిన మంత్రికి పోలీసులు ధన్యవాదాలు తెలిపారు.