Monday, May 13, 2024

కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్

spot_img

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి వరుసగా నేతలు దూరం అవుతున్నారు. తాజాగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేష్ ముదిరాజ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీలో గత 35 ఏళ్లుగా పనిచేస్తున్న బీసీలకు గుర్తింపు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read.. అత్యంత కాలుష్య నగరాల్లో ఫస్ట్ ప్లేస్‎లో ఢిల్లీ.. నవంబర్ 10 వరకు స్కూళ్లకు సెలవులు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఆంధ్ర నాయకుల పెత్తనం ఎక్కువైంది. తెలంగాణ రాష్ట్రం వద్దు అన్న షర్మిల , చంద్రబాబు లు తెలంగాణ కాంగ్రెస్ ను శాసిస్తున్నారు. కాంగ్రెస్ లో డబ్బులకు ఎమ్మెల్యే సీట్లను అమ్ముకుంటున్నారు. డబ్బు లేనివారికి కాంగ్రెస్ లో స్థానం లేదు.  ముఖ్యమంత్రి కేసీఆర్ ముదిరాజులకు సముచిత స్థానం కల్పిస్తానని హామీనిచ్చారు. నా అనుచరులతో చర్చించి త్వరలో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణహించుకున్నట్లు తెలిపారు.

Latest News

More Articles