అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కర్నాటక పర్యటన లో ఉన్న ఆయన అక్కడ కూడా తెలంగాణలో అమలవుతున్న పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. దక్షిణ కన్నడ ప్రధాన కేంద్రం మంగళూరు లో గీతవృత్తిని పునరుద్ధరించాలని స్వామి ప్రణవానంద చేపట్టిన మహాపాదయాత్ర ను జెండా ఊపి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కుల వృత్తులకు వైభవాన్ని తీసుకొచ్చారని చెప్పారు. కర్ణాటక లో గీత వృత్తిని పునరుద్ధరించేందుకు చేస్తున్న పోరాటాలకు తెలంగాణ గౌడ సంఘాలు మద్దతుగా ఉంటాయన్నారు.