బస్సు డ్రైవర్ల కృషిని గుర్తించే ప్రయత్నంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) బుధవారం తెలంగాణలో డ్రైవర్ల దినోత్సవాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా హైదరాబాద్లో టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కొంతమంది ఆర్టీసీ డ్రైవర్లను కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు.
ఇరవై వేల మంది టిఎస్ఆర్టిసి డ్రైవర్ల కృషిని మరియు ప్రతిరోజూ 55 లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చడంలో వారు పోషిస్తున్న పాత్రను ఆయన అభినందించారు. తమ విధులను నిబద్ధతతో, సహనంతో నిర్వహిస్తూ దేశానికే TSRTC రోల్ మోడల్గా నిలిచినందుకు డ్రైవర్లను సజ్జనార్ అభినందించారు.