ఉత్తర్ప్రదేశ్లోని అలీగఢ్లో విషాదకర ఘటన జరిగింది. కొత్వాలినగర్ ఎస్సై తుపాకీని శుభ్రం చేస్తుండగా పొరపాటున ఫైర్ అయింది. ఆ సమయంలో పాస్పోర్టు వెరిఫికేషను కోసం పోలీస్స్టేషన్కు వచ్చి నిలబడి ఉన్న మహిళ తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
Also Read.. ఫిలిం నగర్ లో దారుణం. అప్పు తీర్చలేదని భార్యాభర్తల దారుణ హత్య!
ఈ ఘటనకు సంబంధించిన పోలీస్ స్టేషన్ సీసీ టీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐ మనోజ్శర్మపై క్రిమినల్ కేసు నమోదు చేసి, తక్షణం సస్పెండు చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఎస్ఐపై చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు ఎస్పీ వెల్లడించారు.