Sunday, May 19, 2024

భార్య గొంతుకోసి, బిల్డింగ్ మీద నుంచి కిందపడేసిన కానిస్టేబుల్

spot_img

హైదరాబాద్‎లో దారుణ ఘటన జరిగింది. భార్య గొంతుకోసి, బిల్డింగ్ మీద నుంచి కిందపడేశాడు ఓ భర్త. ఈ అమానుష ఘటన వనస్థలిపురంలోని గౌతమి నగర్‏లో శుక్రవారం చోటుచేసుకుంది. కుంచపు రాజ్ కుమార్, శోభలు భార్యభర్తలు. రాజ్ కుమార్ కానిస్టేబుల్‎గా హైకోర్టులోని 4వ గేట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా.. భార్యభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం కూడా గొడవపడ్డారు. ఆగ్రహానికిలోనైన రాజ్ కుమార్.. కత్తితో భార్య గొంతుకోసి, మొదటి అంతస్తు నుంచి కిందికి తోసేశాడు. దాంతో తీవ్రగాయాలైన శోభ అక్కడికక్కడే మృతిచెందింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి, రాజ్ కుమార్‎ను అదుపులోకి తీసుకున్నారు. ఎల్‎బీ నగర్ డీసీపీ సాయి శ్రీ ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. అక్రమ సంబంధం కారణంగానే దంపతుల మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

Latest News

More Articles