హైదరాబాద్లో దారుణ ఘటన జరిగింది. భార్య గొంతుకోసి, బిల్డింగ్ మీద నుంచి కిందపడేశాడు ఓ భర్త. ఈ అమానుష ఘటన వనస్థలిపురంలోని గౌతమి నగర్లో శుక్రవారం చోటుచేసుకుంది. కుంచపు రాజ్ కుమార్, శోభలు భార్యభర్తలు. రాజ్ కుమార్ కానిస్టేబుల్గా హైకోర్టులోని 4వ గేట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా.. భార్యభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం కూడా గొడవపడ్డారు. ఆగ్రహానికిలోనైన రాజ్ కుమార్.. కత్తితో భార్య గొంతుకోసి, మొదటి అంతస్తు నుంచి కిందికి తోసేశాడు. దాంతో తీవ్రగాయాలైన శోభ అక్కడికక్కడే మృతిచెందింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి, రాజ్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. ఎల్బీ నగర్ డీసీపీ సాయి శ్రీ ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. అక్రమ సంబంధం కారణంగానే దంపతుల మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.