న్యూఢిల్లీ: ప్రధాని మోదీపై షో చేసిన మరుసటి రోజే ఎన్డీటీవీ యాంకర్ రాజీనామా చేయడం దేశ వ్యాప్తంగా చర్చజరుగుతోంది. వివరాల్లోకి వెళితే.. ఎన్డీటీవీ సీనియర్ ఎడిటర్, యాంకర్ శరబ్ జాకబ్ సోమవారం తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆమె 20 ఏండ్లుగా ఎన్డీటీవీలో పని చేస్తుండటం గమనార్హం.
మహిళల పట్ల ప్రధాని మోదీ చూపించే గౌరవంపైన కార్యక్రమాన్ని నిర్వహించిన మరుసటి రోజే మహిళ యాంకర్ రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. దీంతో ప్రధానిపై నిర్వహించిన ప్రోగ్రామ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.