Sunday, May 19, 2024

ముగిసిన ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలు..!

spot_img

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలు కన్నీటి వీడ్కోలు మధ్య ముగిశాయి. మారేడ్ పల్లి శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో లాస్య నందిత అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు తరలివచ్చారు. లాస్య నందితలకు అశ్రునయనాల మధ్య కన్నీటి వీడ్కోలు పలికారు. అంత్యక్రియల్లో ఎమ్మెల్యే హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పల్లరాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డితోపాటు పలువురు పాల్గొన్నారు.

ఖర్ఖానాలోని లాస్య నివాసం నుంచి మారేడ్ పల్లిలోని శ్మశాన వాటికు అంతిమ యాత్రను నిర్వహించారు. అంతిమయాత్ర ప్రారంభానికి ముందు లాస్య పాడెను హారీశ్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి మోసి నివాళులర్పించారు. ఈ ప్రమాదంపై లాస్య నందిత సోదరి నివేదిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ ఆకాశ్ పై 340ఏ సెక్షిన్ కింద పటాన్ చెరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. డ్రైవర్ నిర్లక్ష్యంగానే లాస్య మరణించిందని సోదరి ఫిర్యాదు లో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: లాస్యనందితను వెంటాడిన‌ ప్రమాదాలు

Latest News

More Articles