రాష్ట్రంలో కొత్తగా రెండు డిగ్రీ కాలేజీలు, ఒక జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ, నిర్మల్ జిల్లా ముధోల్ లో డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్పల్లిలో జూనియర్ కళాశాలకు కూడా జూనియర్ కాలేజీని మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
మూడు రోజుల కిందట ప్రభుత్వం రెండు ఇంజినీరింగ్ కాలేజీలతో పాటు డిగ్రీ కాలేజీల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. జేఎన్టీయూ హెచ్ పరిధిలోని మహబూబాబాద్, పాలేరులో ఇంజినీరింగ్ కాలేజీలకు, నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు అనుమతి ఇస్తూ జీవోలు జారీ చేసింది.