Monday, May 20, 2024

మ‌ణిపూర్ లో మ‌ళ్లీ దుండగుల కాల్పులు: ముగ్గురు మృతి

spot_img

మణిపూర్‌లో రెండు వారాల తర్వాత మళ్లీ హింసకు పాల్పడ్డారు కొందరు దుండగులు. తుంగ్ఖుల్‌ నాగా జనాభా అధికంగా ఉండే ఉఖ్రూల్‌ రీజియన్‌లోని తోవాయి కుకీ అనే గ్రామంలో ముగ్గురిని కాల్చి చంపారు. ఇవాళ (శుక్రవారం) తోవాయి కుకీ గ్రామానికి కాపలాగా ఉన్న ముగ్గురిని ఆయుధాలతో వచ్చిన కొందరు దుండగులు కాల్చి చంపారు. దీంతో కొందరు గ్రామస్తులు అక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలోని చెక్‌ పోస్ట్ కు వచ్చి భద్రతా సిబ్బందిని అలర్ట్ చేశారు. సిబ్బంది ఆ గ్రామానికి చేరుకునే లోపే దుండగులు పారిపోయారు. వాళ్ల కోసం గాలింపు చేపట్టడంతో పాటు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పర్యవేక్షిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Latest News

More Articles