రాష్ట్ర వ్యాప్తంగా రేపటి( శనివారం) నుండి మైనార్టీ బంధు పథకం అమలు చేయనుంది ప్రభుత్వం. లబ్ధిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం పంపిణీ చేయనుంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం లో మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ లాంఛనంగా ప్రారంభించనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 8047 మంది మైనార్టీ బంధు పథకంతో లబ్ధిపొందనున్నారు. 79 కోట్ల 9 లక్షల రూపాయలు మొదటి విడత పంపిణీ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం.