Saturday, May 11, 2024

రాష్ట్రంలో కొత్తగా రెండు డిగ్రీ, జూనియర్‌ కళాశాల ఏర్పాటు

spot_img

హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా రెండు డిగ్రీ కాలేజీలు, ఒక జూనియర్‌ కళాశాల ఏర్పాటు కానున్నాది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కొత్తగా నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ, నిర్మల్‌ జిల్లా ముధోల్‌లో డిగ్రీ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. అలాగే నిజామాబాద్‌ జిల్లాలోని కమ్మర్‌పల్లిలో జూనియర్‌ కళాశాలను మంజూరు చేశారు.

ఇదిలా ఉండగా.. మూడు రోజుల కిందట జీఎన్టీయూ హెచ్‌ పరిధిలోని మహబూబాబాద్‌, పాలేరులో ఇంజినీరింగ్‌ కాలేజీలకు, నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలో డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు అనుమతి ఇస్తూ విద్యాశాఖ జీవోలు జారీ చేసింది.

Latest News

More Articles