Saturday, May 18, 2024

ఇంటి ముందు ముగ్గులు వేస్తున్న అక్కాచెల్లెళ్లపైకి దూసుకొచ్చిన లారీ.. చెల్లి మృతి

spot_img

సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటి ముందు ముగ్గులు వేస్తున్న అక్కాచెల్లెళ్లపైకి లారీ దూసుకెళ్లిన విషాద ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. మండవల్లి మండలం కానుకొల్లు గ్రామానికి చెందిన తెదేపా నేత పంగిళ్ల నాగబాబు కుమార్తెలు రోడ్డు పక్కనే ఉన్న తమ ఇంటి ముందు సంక్రాంతి ముగ్గులు వేస్తున్నారు. అదే సమయంలో గుడివాడ నుంచి కైకలూరు వైపు వెళ్తున్న ఇటుకల లారీ వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తేజస్విని (16) దుర్మరణం చెందగా, పల్లవీ దుర్గకు (18) గాయాలయ్యాయి. బాధితురాలిని గుడివాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లారీ డ్రైవర్‌ను ప్రకాశ్‌రావుగా గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాగబాబు కుమార్తె మృతితో పెద్ద సంఖ్యలో తెదేపా నాయకులు కానుకొల్లుకు చేరుకున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులతో కలిసి జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. తేజస్విని, పల్లవీ దుర్గ ముదినేపల్లిలోని ఓ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నారు.

Read Also: క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్

Latest News

More Articles