Saturday, May 18, 2024

పెళ్లైన 5 రోజులకే నదిలో దూకిన కొత్త జంట.. నవవధువు మృతి

spot_img

పెళ్లి జరిగి ఐదు రోజులైనా కాలేదు.. ఇంతలోనే ఆత్మహత్యకు యత్నించారు ఆ నవ దంపతులు. వధువు చనిపోగా.. వరుడిని మత్స్యకారులు కాపాడారు. ఈ దారుణ ఘటన ఏపీలోని పెనుగొండ మండలం సిద్ధాంతం వంతెనపై జరిగింది. వధువు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉండ్రాజవరం మండలం మోర్తకు చెందిన శివరామకృష్ణతో వడలికి చెందిన కోరాడ సత్యవాణి (19)కి డిసెంబరు 15న పెళ్లి జరిగింది. మంగళవారం రాత్రి వడలి నుంచి వీరిద్దరూ సినిమాకి వెళ్తున్నామని ద్విచక్రవాహనంపై బయటకు వెళ్లారు. తర్వాత ఏమైందో.. ఏమో కానీ, సిద్ధాంతం వంతెన వద్ద వారి బండిని గుర్తించారు. మత్స్యకారుల సాయంతో బయటకొచ్చి వరుడు కుటుంబ సభ్యులకు, పోలీసులుకు సమాచారం ఇచ్చాడు. దాంతో పోలీసులు బుధవారం గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టగా.. సత్యవాణి మృతదేహం లభించింది. శివరామకృష్ణ ఏదో చేసి నాటకం ఆడుతున్నాడని వధువు బంధువులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: లోన్‎యాప్ వేధింపులకు హైదరాబాద్‎లో యువకుడు బలి

Latest News

More Articles