భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. టెంపో వాహనం అదుపుతప్పి లోయలోపడ్డది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందగా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో టెంపో వాహనం బోల్తాపడింది. మృతులలో దుర్గారావు, శ్రీనివాస రావు , ఓ బాలుడు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఏపీలోని చింతలపూడి చెందిన భక్తులు భద్రాచలం రామాలయానికి వచ్చి తిరిగి వెళుతుండగా ప్రమాదం జరిగిందని చెప్పారు. క్షతగాత్రులను భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.