వికారాబాద్ జిల్లా: సంచలనం సృష్టించిన శిరీష అనుమానాస్పద మృతి కేసు మిస్టరీ వీడింది. సొంత బావే హత్య చేశాడని పోలీసులు నిర్ధారించారు. మీడియా సమావేశం నిర్వహించి కేసు వివరాలు వెల్లడించిన వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి వివరించారు.
‘‘చెప్పిన మాట వినడం లేదని… ఎప్పుడూ ఫోన్ చూస్తూ ఉంటుందని శిరీషతో బావ అనిల్ వాగ్వాదం జరిగింది. అదే సమయంలో మరో రూంలోకి వెళ్ళి శిరీష ఆత్మహత్యాయత్నం చేసింది. రూం గడియ విరగొట్టి శిరీషను బయటకు తెచ్చి చెయ్యి చేసుకున్న అనిల్. అనంతరం పరిగి వెళ్ళిపోయిన అనిల్. మనస్థాపానికి గురై బయటకు వెళ్ళిపోయిన శిరీష.
శిరీష ఇంట్లో నుండి వెళ్ళిపోయిందని తన అక్కకు ఫోన్ చేసి చెప్పిన శిరీష తమ్ముడు. భార్య ద్వారా సమాచారం అందుకున్న అనిల్ బయలుదేరాడు. అప్పటికే ఫుల్ గా మద్యం సేవించిన అనిల్ మరో బీర్ బాటిల్ తీసుకొని కాడ్లాపూర్ బయలుదేరాడు. ఈక్రమంలో ఊరు శివారులో ఉన్న మైసమ్మ గుడి దగ్గర శిరీష కనిపించింది.
ఆగ్రహంతో శిరీష పై చెయ్యి చేసుకున్నాడు. అక్కడే ఉన్న కుంటవైపు లాకెళ్ళి వెంటతెచ్చుకున్న బీరు బాటిల్ పగల గొట్టి కళ్ళల్లో గుచ్చి హత్యా యత్నం చేశాడు. తనను వదిలేయండి అంటూ శిరీష ఎంత ప్రదేయపడ్డా క్రూరుడు వదలలేదు. మోకాలు లోతు నీళ్ళున్న కుంటలో విసిరేసి చనిపోయే వరకు శిరీష దేహన్ని నీళ్ళల్లో అదిమి పట్టాడు. చనిపోయిందని నిర్దారించుకొని అక్కడ ఆనవాళ్ళను మాయం చేసి ఏమి తెలియనట్టు వెళ్లి మళ్ళీ శిరీష కోసం వెతికాడు.
శిరీష పై మనసు పడేసుకున్న అనిల్ తన మాట వినడం లేదని యువతి పై కక్ష్య పెంచుకున్నాడు. అత్యాచారం జరిగిందా లేదా అనేది ఎఫ్ ఎస్ ఎల్ రిపోర్ట్ తర్వాత తేలుతుందని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. నిందితుడిపై గతంలో కూడా కేసులు ఉన్నాయని, నిందితుడిపై హత్యానేరం కింద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు పేర్కొన్నారు.