టెస్టు ర్యాంకింగ్స్ ను అంత్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) విడుదల చేసింది. టెస్టు బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ టాప్ బౌలర్గా నిలిచారు. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో మెరుగైన ఆటను ప్రదర్శించిన అజింక్య రహానే(37వ స్థానం), శార్దూల్ ఠాకూర్(94వ స్థానం)లు ర్యాంకింగ్స్లో చోటు దక్కించుకున్నారు.
ఇక ఐసీసీ ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియాకు చెందిన ముగ్గురు బ్యాటర్లు మార్నస్ లబుషేన్(903 రేటింగ్ పాయింట్ల), స్టీవ్ స్మిత్(885), ట్రావిస్ హెడ్(884) టాప్ త్రీ ప్లేస్ లో నిలిచారు. గాయపడి కోలుకుంటున్న వికెట్ కీపర్ రిషబ్ పంత్ 10వ స్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ (12), విరాట్ కోహ్లీ (13) స్థానాల్లో ఉన్నారు.
ఐసీసీ ర్యాంకింగ్స్ లో ముగ్గురు టాప్ బ్యాటర్లు ఒకే దేశానికి చెందిన వారు కావడం చాలా అరుదు. 1984లో ఒకసారి ఇలా జరిగింది. అప్పటి జాబితాలో విండీస్ ప్లేయర్లు గ్రీనిడ్జ్, క్లైవ్ లాయిడ్, లారీ గోమ్స్లు వరుసగా టాప్ ప్లేస్ లో నిలిచారు.