ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచులో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలయిన టీమిండియా.. మరికొన్ని రోజుల్లో డబ్ల్యూటీసీ 2023-25 పోరును ప్రారంభించనుంది. జులైలో విండీస్తో జరిగే రెండు టెస్టుల సిరీస్తో భారత్ డబ్ల్యూటీసీ 2023-25 మ్యాచ్లు మొదలవుతాయి.
టీమిండియా మొత్తం 19 టెస్టులు ఆడనుంది. స్వదేశంలో ఇంగ్లాండ్తో 5, బంగ్లాదేశ్తో 2, న్యూజిలాండ్తో 3 టెస్టులు ఆడనుంది. విదేశాల్లో విండీస్లో 2, దక్షిణాఫ్రికాలో 2, ఆస్ట్రేలియాతో 5 టెస్టులను టీమిండియా ఆడనుంది.
డబ్ల్యూటీసీ 2023-25 షెడ్యూల్
విండీస్లో.. జులై 12-16 తొలి టెస్టు (డొమినికా), జులై 20-24 రెండో టెస్టు (ట్రినిడాడ్)
సౌతాఫ్రికాలో.. డిసెంబరు 2023- జనవరి 2024 వరకు 2 టెస్టులు
భారత్లో ఇంగ్లాండ్ పర్యటన: జనవరి/ఫిబ్రవరి 2024. 5 టెస్టులు
భారత్లో బంగ్లాదేశ్ పర్యటన: సెప్టెంబరు/అక్టోబరు 2024. 2 టెస్టులు
భారత్లో న్యూజిలాండ్ పర్యటన: అక్టోబరు/నవంబరు 2024. 3 టెస్టులు
ఆస్ట్రేలియాలో భారత్ పర్యటన: 2024-25 (బోర్డర్-గావస్కర్ ట్రోఫీ), నవంబర్ 2024-జనవరి 2025. 5 టెస్టులు