Sunday, May 19, 2024

రేపే డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ..ఎవరెవరు ఎక్కడంటే

spot_img

హైదరాబాద్: సోమవారం మంత్రులు, మేయర్ తదితరులు మూడోవిడతలో భాగంగా 2BHK (డబుల్ బెడ్ రూం ఇండ్లు)పంపిణీ చేయనున్నారు. కుత్బుల్లా పూర్ నియోజకవర్గ పరిధిలోని దుండిగల్ లో హోంమంత్రి మహమూద్ అలీ 3,142 మంది లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారు. చేవెళ్ళ నియోజకవర్గ పరిధిలోని శంకర్ పల్లిలో మైనింగ్ శాఖ మంత్రి మహేందర్ రెడ్డి 1361 మంది లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారు.

Also Read.. టీఎస్ఆర్టీసీ దసరా గిఫ్ట్.. ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ చార్జీలే

మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని మన్ సాన్ పల్లిలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి 2099 మంది లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారు.శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని నల్లగండ్ల లో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ 344 మంది లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారు. రాజేంద్ర నగర్ నియోజకవర్గ పరిధిలోని నార్సింగ్ లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి 356 మంది లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారు.

Also Read.. చందర్ గెలవగానే రామగుండంని దత్తత తీసుకుంటా.. కేటీఆర్ హామీ

పటాన్ చెరువు నియోజకవర్గ పరిధిలోని కొల్లూరు -2 లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు 6067 మంది లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారు. మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని అహ్మద్ గూడ లో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి 1965 మంది లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారు. మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని రాంపల్లి లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 3214 మంది లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారు.ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని అబ్దుల్లాపూర్ మెట్ లో విద్యా శాఖ మంత్రి సభితా ఇంద్రారెడ్డి  472 మంది లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారు.

Latest News

More Articles