Monday, May 20, 2024

మెదక్ ఎల్లమ్మ ఆలయంలో చోరీ

spot_img

మెదక్ జిల్లా కొల్చారం మండలం ఎనగండ్లలోని ఎల్లమ్మ ఆలయంలో దుండగులు తాళాలు ధ్వంసం చేసి చోరికి పాల్పడ్డారు. ఈ దృశ్యాలన్ని సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. హుండీలోని డబ్బులతో పాటు, ఇతర సామాగ్రిని కలిపి సుమారు 4 లక్షల రూపాయలకు వరకు ఎత్తుకెళ్లినట్లు గ్రామస్థులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ ఆలయంలో నెలరోజుల వ్యవధిలోనే మూడు సార్లు దొంగతనం జరిగిందని… కొల్చారం పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: యాదాద్రి ఆలయ విమాన గోపురానికి రాగి తాపడం పూర్తి

Latest News

More Articles