హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని తీవ్రంగా కొట్టి..కుర్చీకి కట్టేసి ఇంట్లోఉన్న డబ్బు, నగలను ఎత్తుకెళ్లారు దుండగులు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వృద్ధురాలు స్నేహలత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. దోమలగూడు గగన్ మహల్ లోని రాధామాదవ్ నివాస్ మొదటి అంతస్తులో మహేశ్ తన భార్య, కుమారుడు కలిసి ఉంటున్నాడు. స్నేహలత కొంత కాలంలో అనారోగ్యంతో బాధపడుతుంది. స్నేహలతను చూసుకునేందుకు బీహార్ కుచెందిన పనిమనిషిగా పెట్టాడు మహేశ్.
ఈ క్రమంలో బుధవారం స్నేహలత కుటుంబ సభ్యులు మార్కెట్ కు వెళ్లారు. ఒంటరిగా ఉన్న స్నేహలతను పనిమనిషి మరో వ్యక్తి కలిసితో కలిసి కర్చీలో బంధించాడు. తీవ్రంగా కొట్టడంతో అరుపులు బయటకు వినిపించకుండా నోట్లో గుడ్డు పెట్టారు. బీరువాలో ఉన్న నగులు, బంగారాన్ని దోచుకుని ఉడాయించారు. కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూసేసరికి స్నేహలత కుర్చిలో అపస్మారక స్థితిలో ఉంది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మరణించినట్లు తెలిపారు. అయితే పనిమనిషి కనిపించకపోవడంతో అతడే హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న గాంధీనగర్ ఏసీపీ రవికుమార్, దోమలగూడ ఎస్సై శ్రీనివాస్ రెడ్డితోపాటు క్లూస్ టీం సందర్శించాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలు పెట్టారు.
ఇది కూడా చదవండి: విషాదం..పోలీస్ జాబ్ రాలేదని యువకుడి సూసైడ్..!!