Friday, May 3, 2024

శంషాబాద్ ఎయిర్ పోర్టులో ముగ్గురు అనుమానితులు అరెస్ట్..!

spot_img

రంగారెడ్డి జిల్లా: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో తనిఖీల సందర్భంగా ముగ్గురు అనుమానితులను కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. బహ్రెయిన్, కువైట్, దుబాయ్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వచ్చిన ముగ్గురు  ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు.

Read Also.. తండ్రి క‌ల‌ను నిజం చేసిన టెన్నిస్ స్టార్.. కానీ అది చూసేందుకు..!!

కువైట్ నుండి వచ్చిన ప్రయాణికుడి వద్ద 40.163 గ్రాముల అక్రమ బంగారాన్ని గుర్తించామని, మరో ప్రయాణికుడి వద్ద 350.74 గ్రాముల బంగారం గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడ్డ బంగారం విలువ దాదాపు 99 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు కస్టమ్స్ అధికారులు.  మరో నిందితుడు బహ్రెయిన్ నుండి 13 లక్షల విలువైన అక్రమ కరెన్సీ తీసుకువచ్చాడని వెల్లడించారు.

Latest News

More Articles