గోదావరి నదిలో నీటి వాటాలు, నదిపై ఎత్తిపోతల ప్రాజెక్ట్ లకు సంబంధించిన అనుమతులపై చర్చించేందుకు గోదావరి నది యాజమాన్య బోర్డు (GRMB) నేడు సమావేశం కానుంది. హైదరాబాద్ లోని జలసౌధలో ఈ మీటింగ్ జరగనుంది. బోర్డు చైర్మన్ ఎంకే సిన్హా అధ్యక్షతన జరిగే ఈ మీటింగ్ లో పలు అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా కడెం-గూడెం ఎత్తిపోతల పథకం, మెండికుంటవాగు ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన అనుమతుల ప్రక్రియపై సమావేశంలో కీలకంగా చర్చ జరగనుంది. ఉమ్మడి రాష్ట్రం కాలంలో గోదావరిలో నీటి లభ్యతపై అధ్యయనానికి కన్సల్టెన్సీ నియామకం, బోర్డు నిర్వహణ, నిధులు, ఉద్యోగులు, సీడ్ మనీ, వంటి అంశాలకు చర్చకు రానున్నాయి. పెద్దవాగు ఆనకట్ట ఆధునికీకరణ, రాష్ట్రాల సరిహద్దుల్లో గోదావరిపై టెలిమెట్రీ వ్యవస్థల ఏర్పాటు పై కూడా బోర్డు అధికారులు ఈ సమావేశంలో చర్చలు జరపుతారు.