ఢిల్లీ: రాజ్యసభ లో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్పు చేశారు. ఈ మేరకు బులిటీన్ విడుదల చేసింది రాజ్యసభ సచివాలయం. బీఆర్ఎస్ తరపున ఏడుగురు సభ్యులు ఉన్నట్లు బులిటెన్ లో రాజ్యసభ సచివాలయం పేర్కొన్నది.
అన్ని పార్టీల సభ్యుల వివరాలతో… పార్టీ వారీగా సంఖ్యను ప్రకటించిన రాజ్యసభ సచివాలయం. రాజ్యసభలో బీఆర్ఎస్ నేతగా కేశవరావు పేరును బులిటీన్ లో పేర్కొన్నది రాజ్యసభ సచివాలయం.