దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపించాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TS RTC) నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇవాళ్టి (శుక్రవారం) నుంచి ఈ నెల 25 వరకు రాష్ట్రంలో ప్రత్యేక బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
రాష్ట్ర వ్యాప్తంగా 5,265 అదనపు సర్వీసులను దసరా, బతుకమ్మ పండుగలకు రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం నడుపనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. అయితే ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని, సాధారణ ఛార్జీలతోనే ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించవచ్చని ప్రకటించింది.
ఇది కూడా చదవండి: వందల కోట్ల పంపిణీ.. ముఠా నాయకుడు రేవంత్ రెడ్డే!!