Monday, May 20, 2024

వేగ‌వంత‌మైన సేవ‌ల కోసం ఈఆర్పీ.. దేశంలో తొలిసారిగా తెలంగాణలోనే

spot_img

ప్రయాణీకులకు మెరుగైన, నాణ్యమైన‌ సేవల్ని అందించేందుకు గానూ అత్యాధునిక సాంకేతికను టీఎస్ఆర్టీసీ వినియోగిస్తోంది. ఈ మేరకు ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ (ERP) ప్రాజెక్ట్ అమలుతో ఆధునికీకరణ వైపు దిశ‌గా సాంకేతికతలో ముందడుగు వేసింది. 9వేల‌కు పైగా బస్సులు, 50 వేల‌ మంది ఉద్యోగులు, దాదాపు 10 వేల‌ గ్రామాలను కలుపుతూ ప్రతిరోజూ 35 లక్షల కిలోమీటర్ల న‌డుపుతూ సుమారు 45 లక్షల మంది ప్రయాణికులకు ర‌వాణా సేవలు అందిస్తోంది.

ఇంత విస్తృత నెట్వర్క్ కలిగి ఉన్న సంస్థ.. అన్ని సేవలను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చింది. డిజిటలైజేషన్ ఆవశ్యకతను గుర్తించి, ఈఆర్పీ ప్రాజెక్టులో భాగంగా సెంట్ర‌లైజ్డ్ ఇంటిగ్రేటెడ్ సొల్యుష‌న్‌ (CIS) పై మొగ్గు చూపి వాటి సేవ‌ల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అందుకు న‌ల్సాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌తో సంస్థ ఓ ఒప్పందం చేసుకుంది. హైద‌రాబాద్ బ‌స్ భ‌వ‌న్‌లో మంగ‌ళ‌వారం సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మ‌న్ అండ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ వీసీ స‌జ్జ‌న‌ర్‌ ఈ ఈఆర్పీ సేవ‌ల్ని లాంఛ‌నంగా ప్రారంభించారు.

Latest News

More Articles