Friday, May 10, 2024

అందరికీ అందుబాటులో ఉంటా : ఎమ్మెల్యే లాస్య నందిత

spot_img

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా లాస్యనందిత విజయం సాధించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఆమెకు అన్ని వర్గాల ప్రజలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మంగళవారం పలువురు ఎమ్మెల్యేకు శుభాకాంక్షలులు తెలిపి సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల ఆదరాభిమానాలు, పార్టీ శ్రేణుల సమిష్టి కృషితోనే తాను భారీ మెజార్టీతో విజయం సాధించానని ఆమె తెలిపారు.

తనకు అపూర్వ విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు అన్నివిధాల అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రజలకు మరింత సేవచేసి, తన తండ్రి సాయన్న పేరు నిలబెడతానన్నారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో కంటోన్మెంట్‌ బోర్డు మాజీ సభ్యుడు భాగ్యశ్రీ శ్యాంకుమార్‌, సీనియర్‌ నాయకులు శ్యాంకుమార్‌, మహిళా నేతలు విజయలక్ష్మి, మనీషా, ఈశ్వరమ్మ, నాగ భార్గవితో పాటు శివ నారాయణ్‌ శర్మ, అజయ్‌ శర్మ, భాస్కర్‌ ముదిరాజ్‌, హరి, పలు వార్డులకు చెందిన సీనియర్‌ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Latest News

More Articles