మెదక్ జిల్లా: మెదక్ పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీని టిప్పర్ ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. తల్లికి గాయాలు కాగా స్థానిక ఆసుపత్రికి తరలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దీపావళి పండుగ సందర్భంగా టపాకాయలు కొనడానికి తల్లితో పాటు చిన్నారులు స్కూటీపై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అయితే, మరణించిన వారిని హోంగార్డ్ కుటుంబ సభ్యులుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
Also Read.. హనుమకొండ జిల్లాలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి!