Friday, May 3, 2024

మ‌హారాష్ట్ర‌లో ఘోర ప్ర‌మాదం: డివైడ‌ర్‌ను ఢీకొట్టిన ఆటో..ఇద్దరు మృతి

spot_img

మ‌హారాష్ట్ర‌లోని భివండిలో నిన్న(శుక్ర‌వారం) ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ప్ర‌ధాన ర‌హ‌దారిపై ఓ ఆటో అతి వేగంతో దూసుళ్లి డివైడ‌ర్‌ను ఢీకొట్టింది. అయితే రోడ్డు దాటుతున్న యాక్టివాను త‌ప్పించే క్ర‌మంలో.. వేగంతో వెళ్తున్న ఆటో అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఆటో వెళ్తున్న ఐదుగురిలో ఇద్ద‌రు అడికక్క‌డే ప్రాణాలు  మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు.  గాయపడిన  వారిని ఆస్పత్రికి తరలించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి: మే 10న తెరుచుకోనున్న కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు

Latest News

More Articles