Sunday, May 19, 2024

విద్యుత్ షాక్ తో ఇద్ద‌రు రైతులు మృతి

spot_img

విద్యుత్ షాక్‌తో ఇద్దరు రైతులు మృతి చెందారు. మహబూబ్‌నగర్ జిల్లా  చిన్నచింతకుంట మండలం పర్దిపూర్ గ్రామానికి చెందిన కుర్వ మల్లప్ప (50) గాజా మోహన్ రెడ్డి(55) ఇవాళ( శుక్రవారం) ఉదయం తమ పొలాల దగ్గర ఉన్న మోటార్‌ను రిపేరు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే చనిపోయారు. ప్రక్క పొలాల రైతులు చూసి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న చిన్నచింతకుంట పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి: పాము కాటుకు విరుగుడు కనిపెట్టిన శాస్త్రవేత్తలు..!

Latest News

More Articles