రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. దీనిని అదునుగా భావించిన వేములవాడ పట్టణంలోని సాయినగర్ కు చెందిన పత్రి గణేష్, మంచిర్యాల జిల్లా హమాలివాడకు చెందిన చంద సతీష్ లు భక్తుల వద్ద నుండి పరుసులు దొంగలిస్తూ ఎస్పిఎఫ్ సిబ్బందికి ఫట్టుపడ్డారు.
ములుగు జిల్లా గోవిందరావుపేట చెందిన చంద్రశేఖర్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి రాజన్న దర్శణానికి క్యూ లైన్ లో వెళుతుండగా తన పర్స్ ను దొంగలించడంతో బాధితులు విషయాన్ని ఎస్పీఎఫ్ సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో చాకచక్యంగా సీసీ కెమెరాల ఆధారాలతో నిందితులను పట్టుకొనీ వారి వద్ద నుండి 35,690 రూపాయలు స్వాధీనం చేసుకొని టౌన్ పోలీసులకు అప్పగించారు. దీనికి సహకరించిన ఎస్పీఎఫ్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ కుమార స్వామి, ప్రవీణ్, రవి, రంగ స్వామి లను అభినందించారు.