భద్రతా బలగాలు జరిపిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా జిల్లాలోని ఉరీ పట్టణంలో హత్లంగా ఫార్వార్డ్ ఏరియాలోఇవాళ(శనివారం) ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందినట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు చేశారు. ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాలనే ఉద్దేశంతో అనంత్నాగ్ జిల్లాలోని కోకెర్నాగ్ ప్రాంతంలోని గాడోల్లోని అటవీ ప్రాంతంలో జమ్మూకశ్మీర్ పోలీసులతో పాటు భారత సైన్యం వరుసగా నాలుగు రోజుల నుంచి ఎన్కౌంటర్ కొనసాగిస్తోంది.