న్యూఢిల్లీ : ఎంఫిల్(మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ) కోర్సులపై యూజీసీ కీలక ప్రకటన చేసింది. దేశంలోని యూనివర్సిటీలు అందించే ఎంఫిల్ ప్రోగ్రామ్లకు ఎలాంటి గుర్తింపు లేదని తేల్చిచెప్పింది. ఎంఫిల్ ప్రవేశాలు ఎవరూ తీసుకోవద్దని హెచ్చరించింది.
2023-24 విద్యాసంవత్సరంలో ఎంఫిల్ కోర్సులు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని యూజీసీ గుర్తు చేసింది. ప్రస్తుతం కొన్ని యూనివర్సిటీలు ఎంఫిల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తమ దృష్టికి రావడంతో మరోసారి హెచ్చరించాల్సి వచ్చిందని తెలిపింది.