సికింద్రాబాద్: ఆషాడ బోనాల ఉత్సవాల సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద ఘటాల ఊరేగింపు ను ప్రారంభించారు. ముందుగా ఆలయ పండితులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు.
అనంతరం అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఘటాల ఊరేగింపుకు ముందు డప్పు చప్పుళ్ళు, పోతురాజుల నృత్యాలతో ఆలయ పరిసరాలు ఎంతో సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో ఆలయ EO మనోహర్ రెడ్డి, ఆలయ చైర్మన్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.