అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా జనవరి 22న రాష్ట్రవ్యాప్తంగా అన్ని మాంసం, చికెన్ దుకాణాలను మూసివేయనున్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే ఈ వేడుకని ఉత్తరప్రదేశ్లో పబ్లిక్ హాలిడేగా ప్రకటించారు. ఈ సమయంలో అన్ని మద్యం దుకాణాలు కూడా మూసివేయబడతాయి. జనవరి 22న అన్ని మాంసం, మద్యం దుకాణాలు మూసి ఉండేలా చూడాలని అన్ని జిల్లాల మేజిస్ట్రేట్లు, కమిషనర్లకు యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డిఎస్ మిశ్రా ఆదేశాలు జారీ చేశారు.
దీనికి తోడు జనవరి 14 నుంచి 21 వరకు ప్రభుత్వం పారిశుద్ధ్య ప్రచారం నిర్వహించి జనవరి 22 నుంచి 26 వరకు ప్రభుత్వ భవనాలు, ఆలయాలకు ముఖద్వారం దీపాలంకరణ నిర్వహించిందని, వాటన్నింటినీ పటిష్టంగా అమలు చేయాలని మిశ్రా తెలిపారు. యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డిఎస్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ. “రామ మందిరానికి వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముఖ్యమైన నగరాల నుండి అయోధ్య వరకు గ్రీన్ కారిడార్లను రూపొందించాలని నిర్దారించుకున్నాం” అని అన్నారు.