Saturday, May 18, 2024

విద్యార్థిని తీవ్రంగా కొట్టి..నోట్లో మూత్రం పోసి యూపీలో ఘోరం..!!

spot_img

యూపీలో పాతకక్షలతో ఓ విద్యార్థిని కిడ్నాప్ చేసిన కొందరు దుండగులు అతన్ని తీవ్రంగా కొట్టారు. చెవిపై తుపాకీ పెట్టి కాల్చివేస్తామంటూ బెదిరిస్తూ చిత్ర హింసలకు గురిచేశారు. దాదాపు 12 మంది నిందితులు ఒకరి తర్వాత ఒకరు విద్యార్థి నోట్లో మూత్రం పోసి తాగమంటూ హింసించారు. చెప్పులపై ఉమ్మి వేసి నాలుకతో నాకమంటూ బలవంతంచేశారు. ఈ కేసులో హెడ్ కానిస్టేబుల్ ధర్మేంద్ర యాదవ్ తోపాటు మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

ఇది కూడా  చదవండి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..అగ్నివీర్ రిక్రూట్ మెంట్ ప్రక్రియ షురూ…!!

కాన్పూర్ లోని సివిల్స్ లైన్స్ ప్రాంతంలో ఉన్న స్నేహితురాలిని కలవడానికి మరో మిత్రుడితో వచ్చిన బాధిత విద్యార్థిని అప్పటికే కారులో అక్కడే మాటువేసిన నిందితులు తుపాకీ చూపించి కిడ్నాప్ చేశారు. నగరానికి దూరంగా ఉన్న రైల్వే ట్రాక్ వద్దకు తీసుకెళ్లారు. నిందితుల్లో ఒక్కడైన హిమాంశు యాదవ్ తన తండ్రి అయిన హెడ్ కానిస్టేబుల్ ధర్మేంద్రయాదవ్ కు సమాచారం పంపించి అక్కడికి రప్పించాడు. అందరూ కలిసి విద్యార్థిపై దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా కొట్టి..చిత్రహింసలు పెట్టారు. ఈ కేసులో అరెస్ట్ అయిన ఇంటెలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్ ధర్మేంద్ర యాదవ్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. గతేడాది అక్టోబర్ లో ఎంసీఏ విద్యార్థిపై ధర్మేంద్ర యాదవ్ హత్యాయత్నం కేసు పెట్టాడు.

Latest News

More Articles